కావ్యావతారికలో....
పాఠకునికి గ్రంథం యొక్క ప్రాథమిక సమాచారం, రచన నేపథ్యం, గ్రంథంలోని ముఖ్య విషయం, పరిస్థితులు సూక్ష్మంగా తెలుపునది "అవతారిక". ఈ అవతారిక ను ' ముందుమాట ' లేదా పీఠిక లేదా ఉపోద్ఘాతం లేదా భూమిక మొదలగు పేర్లతో పిలుస్తారు. గ్రంథం ఏవిధంగా అవతరించింది తెలుపుటయే అవతారిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అవతారిక సాంప్రదాయానికి ఆద్యులు నన్నయ్య. కావ్యానికి వ్రాయబడిన అవతారిక లను కావ్యావతారికలు అంటారు. కావ్య అవతారికల వల్ల ఈ విషయాలు తెలుసుకోవచ్చు కృతికర్త - అతని కాలం - రచనలు - అతని వంశక్రమం కృతి భర్త వివరాలు కావ్యం యొక్క ఉద్దేశం రచనా రీతులు-అభిప్రాయాలు కావ్యంనాటి చారిత్రక విషయాలు సుకవి-కుకవుల ప్రస్తావన ఇతర కవులు ప్రస్తావన మొ" నన్నయ్య యొక్క భారత అవతారిక వల్ల అతని వ్యక్తిత్వం, కవితా లక్షణాలు తెలుస్తున్నాయి. " సారమతింగవీంద్రులు ప్రసన్నకథా కవితాయుక్తి లో నారసిమేలునా నితరు లక్షర రమ్యత నాధరింప నా నారుచిరార్ధ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా భారత ...