Posts

Showing posts from August, 2020

చేమకూర "విలాసం"

       ప్రబంధ యుగం అనంతరం సాహిత్యరంగంలోని కాలాన్ని దక్షిణాంధ్ర యుగం.  ఈ దక్షిణాంధ్ర యుగం లో " అభినవ భోజుడు "  గా పేరుగాంచిన రఘునాధ నాయకు ని కళానిలయానికి విజయ భవనము అనే పేరు ఉండేది. ఆ విజయ భవనములో ప్రఖ్యాత కవి చేమకూర వేంకటకవి .   రఘునాథ నాయకుడు అంటే అమితమైన భక్తి విశ్వాసాలు గలవారు చేమకూర.  చేమకూర తన రచనలను  రఘునాథ నాయకుని కి అంకితం ఇచ్చాడని తెలుస్తుంది.  అంతేకాకుండా కవి పండితుడు అయినా రఘునాధ నాయకునిచే ప్రశంసలు అందుకున్నాడు.           "ప్రతి పద్యము నందు చమ            త్కృతి గలుగంజెప్ప నేర్తు వెల్లెడ బెళుకౌ            కృతి వింటి ముపారముగా            క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదు సుమీ"      ప్రతి పద్యము నీలాగా చక్కని చమత్కారంతో చెప్పు నేర్పు ఈ భూమిపై ఎవరికీ రాదని రఘునాథ నాయకుడు అంతటివాడు చేమకూర వెంకటకవిని ప్రశంసించారు.        చమత్కారాలతో చేమకూర వెంకటక వి ' విజయ విలాసం ', సారంగధర చర...

బద్దెన సు"మతీ"

      శతకములలో సుమతి శతకం తెలుగువారికి ఇలవేల్పు.  భాష సాహిత్యాలకు శైలికి, నడకకు, శబ్దాలంకారములకు, రీతి తత్వబోధనకు, బోధన విధానమునకు ప్రతీకగా నిలుచున్నది. తెలుగువారికి చాలా సన్నిహితమైన వాటిలో సుమతి శతకం ఒకటి.  సాహిత్యంలో అభిరుచులు మారిన సుమతి శతకం మాత్రం తరతరాలుగా మన వారిని అలరించి, నీతిని అందిస్తుంది.   ఈ సుమతి శతకాన్ని బద్దెన లేదా  బద్దె భూపాలుడు రచించాడు.  బద్దె భూపాలుడు "నీతిశాస్త్ర ముక్తావళి" అనే గ్రంథాన్ని కూడా రచించినట్టు తెలుస్తుంది. సుమతి శతకం కంద పద్యాలతో ఉంది.ఈయన 13వ శతాబ్దానికి చెందిన వాడు.  సి.పి.బ్రౌన్ వేమన పద్యాలు సేకరించిన తర్వాత ఈ పద్యాలు సేకరించాడు.  సుమతీ శతకం వేమన శతకం కన్నా ముందే రచింపబడింది.  తెలుగులో మొదటి నీతి శతకము  సుమతీ శతకం.  సుమతి శతకం పై పరిశోధన చేసిన వారిలో మచ్చ హరిదాసు గారు ముఖ్యులు.               "శ్రీరామునిదయచేతను             నారూఢిగా సకల జనులు నౌరాయనగా           ధారాళమైన నీతులు       ...

అలిశెట్టి..."సిటీలైఫ్"

      కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మి, ఏనాడూ సంపాదనకై ఆరాటపడని  అక్షరం అలిశెట్టి ప్రభాకర్.  అక్షరాలకు ఆకలి బాధలను, కన్నీటి చుక్కలను, పేదరికపు ఆశలను చూపిన కవి.  అలిశెట్టి ప్రభాకర్ గారు కవిగానే కాదు చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ గా ప్రఖ్యాతులు.  జగిత్యాలలో "సాహితీ మిత్ర దీప్తీ" సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. "పరిష్కారం" కవిత 1974లో  ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చయిన మొదటి కవిత.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్ గా "సిటీలైఫ్(1992)" ప్రచురించారు.      నగరంలోని మూలలను, మూలాలనూ కవి హృదయం ఎట్లా దర్శించిందో ఈ కవిత మన కళ్ళకు కట్టినట్లు గడుతుంది.  మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కన్పిస్తాయి...       "నగారా మోగిందా        నయాగరా దుమికిందా       నాలుగు రోడ్ల కూడలిలో ఏమది?       అదే, నగరారణ్య హోరు       నరుడి జీవనఘోష       తల్లి ఒడివంటి       పల్లెసీమల్నొదిలి       తరలి...