Posts

Showing posts from December, 2021

తెలుగు పద్యాలు....

      తెలుగు సాహిత్య విశిష్ట ప్రక్రియలలో పద్యం ఒకటి.  పద్యం ఛందోబద్ధమైనది.  లయాత్మకంగా గాన యోగ్యంగా ఉంటుంది.  ధారణకు అనువుగా ఉంటుంది.  అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాల్ని పద్యాల్లో చొప్పించి అందించారు.  పద్య ప్రక్రియలు 'శతకం' ఒక విభాగం.  మేలిమి ముత్యాలు లాంటి శతక పద్యాలు నుండి కొన్ని రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంచుకునేలా ఉంటాయి.  పెద్ద వారి అనుభవాలు, చిన్న వారి జీవితాన్ని సుగమంగా,  సమర్ధవంతంగా తీర్చిదిద్దుకోవడానికి మార్గం చూపుతాయి. నాటి నన్నయ నుంచి నేటి వరకు ఈ పద్యాల యొక్క విశిష్టత ఎంతగానో ఉంది.  ఈ పద్యాలన్నీ శతక విభాగంలో వందగా కూర్చున్నప్పుడు అది శతకం అవుతుంది.  అన్ని పద్యాలు శతకం కాలేవు.   శతకమునకు ఈ క్రింది లక్షణాలు ఉండాలి. సంఖ్యా నియమము మకుట నియమము ఛందో నియమము  రసం నియమము ఆత్మాశ్రయ కవిత ధర్మము ముక్తక లక్షణాలు    తెలుగునాట 12వ శతాబ్దం లోనే శతక ప్రక్రియ జనించింది.  తెలుగులో శతక ప్రక్రియకి  ఆద్యుడు మల్లికార్జున పండితుడు.  అయితే సమగ్రర శతక...